భగవద్గీత - అక్షరపరబ్రహ్మ యోగము - ఎనిమిదవ అధ్యాయము
అక్షరపరబ్రహ్మ యోగమునందలి ప్రధాన విషయములు
అక్షరము, బ్రహ్మము అను రెండు పదములును భగవంతుని సగుణ నిర్గుణ స్వరూపములను తెల్పును. ‘క్షర’ మనగా నశించునది. అక్షరమనగా నాశరహితమైనది. అట్లే భగవంతుని యొక్క ‘ఓమ్’ అను నామమును గూడ అక్షరము, బ్రహ్మము అని పిలిచెదరు. ఈ అధ్యాయమునందు భగవంతునియొక్క సగుణ నిర్గుణ రూపములు, ఓంకారము వర్ణింపబడినవి. కనుక ‘అక్షరపరబ్రహ్మయోగము’ అను పేరు ఈ అధ్యాయమునకు వచ్చినది.
- బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మము మున్నగువానినిగూర్చిన అర్జునుని ప్రశ్నలు, వానికి భగవానుడోసంగిన ప్రత్యుత్తరములు (1వ శ్లో॥ నుండి 7వ శ్లో॥ వరకు)
- ప్రణవోపాసన, దాని యద్భుతఫలితము (8వ శ్లో॥ నుండి 16వ శ్లో॥ వరకు)
- సృష్టి, ప్రళయములగూర్చిన వివరణము (17వ శ్లో॥ నుండి 19వ శ్లో॥ వరకు)
- భగవానుని సనాతనస్వరూపము (20వ శ్లో॥ నుండి 22వ శ్లో॥ వరకు)
- శుక్ల, కృష్ణ మార్గముల వర్ణనము (23వ శ్లో॥ నుండి 26వ శ్లో॥ వరకు)
- యోగియొక్క మహిమ (27వ శ్లో॥ నుండి 28వ శ్లో॥ వరకు)