భగవద్గీత - విభూతి యోగము - పదవ అధ్యాయము
విభూతి యోగమునందలి ప్రధాన విషయములు
ఈ అధ్యాయమునందు ప్రధానముగా భగవంతుని యొక్క విభూతుల వర్ణనముగలదు. విభూతియనగా ఐశ్వర్యము. మహిమాతిశయము. ఈ చరాచర ప్రపంచము అంతయు భగవంతుని యొక్క వ్యక్తరూపమే. కావున వారి విభూతియే అగును. ఇది అంతయు వారి మహిమావిస్తారమే. చిద్విలాసమే అయి ఉన్నది. భగవద్విభూతియే యగు ఈ ప్రపంచమున భగవానుడు విశేషముగ అభివ్యక్తమైన పదార్థములను గూర్చి వ్యక్తులను గూర్చి వర్ణింపబడిన అధ్యాయము అగుటచే దీనికి ‘విభూతియోగము’ అను పేరు వచ్చినది.
- భగవంతుని విభూతియొక్క, యోగశక్తులయొక్క వర్ణనము – వాని నెరుంగుట వలన గలుగు ఫలితము (1వ శ్లో॥ నుండి 7వ శ్లో॥ వరకు)
- ఫల, ప్రభావసహితముగ భక్తియోగముయొక్క నిరూపణము (8వ శ్లో॥ నుండి 11వ శ్లో॥ వరకు)
- అర్జునుడు భగవానుని స్తుతించుట, స్వకీయవిభూతిని, యోగశక్తిని వర్ణించి చెప్పుదని ప్రార్థించుట (12వ శ్లో॥ నుండి 18వ శ్లో॥ వరకు)
- భగవానునిచే గావింపబడిన విభూతి వర్ణనము (19వ శ్లో॥ నుండి 42వ శ్లో॥ వరకు)