భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము
భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ఇరవై ఎనిమిదవ శ్లోకము
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ||
అవ్యక్తాదీని = ఆరంభదశలో కనబడక
భూతాని = సృజింపబడిన జీవులు
వ్యక్తమధ్యాని = మధ్యదశలో కనబడి
భారత = ఓ భరతవంశీయుడా
అవ్యక్తనిధనాని = నశించినపుడు కనబడక
ఏవ = ఆ విధముగా
తత్ర = కనుక
కా పరిదేవనా = దుఃఖమెందులకు
తాత్పర్యం :-
సృజింపబడిన జీవులన్నియు మొదట అవ్యక్తములే. మధ్య అవి వ్యక్తములగుచున్నవి. నాశనము పొందునపుడు మరల అవ్యక్తములగును. అందుచే దుఃఖించుటకు కారణమేమి కలదు.
Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest